హైదరాబాద్, బతుకమ్మ : ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో విషాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్లో బుధవారం ఉదయం ఎస్సై సంజయ్ సావంత్ గుండెపోటుతో మృతి చెందాడు. వివరాలు ఇలా.. నాచారం లో నివాసం ఉండే సంజయ్ సావంత్ (58) ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పని చేస్తున్నారు. బుధవారం ఉదయం పంచాయతీ ఎన్నికల విధులకు వెళ్లాల్సి ఉండటంతో మంగళవారం రాత్రి పోలీస్ స్టేషన్లోనే నిద్రించారు. బుధవారం ఉదయం ఆయన ఒక్కసారిగా కుప్పకూలి పోయారు. కానిస్టేబుల్స్ వెంటనే ఎస్సైని సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
