వేల్పూర్,బతుకమ్మ : అల్పపీడనం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలకు చెరువులు నిండిపోయి అలుగులు పారుతున్నాయి. వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్, పోచంపల్లి గ్రామాల మధ్య రోడ్డు జలమయం కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోచంపల్లి గ్రామస్తులు అంక్సాపూర్ వేల్పూర్ రావాలంటే పడగల్ నుంచి తిరిగి రావలెనని అధికారులు పేర్కొన్నారు. ఇరు గ్రామాల ప్రజలు ఈ మార్గం గుండా రాకుండా దారి మూసి వేశామని, ప్రజలు సహకరించాలని అధికారులు పేర్కొన్నారు.

