నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని కంఠే శ్వర్ సమీపంలోని నీలకంఠేశ్వర్ ఆలయంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం పరిసరాల్లో ఆయన పర్యటించి ఆలయ వైభవం, అభివృద్ధి వివరాలను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు అర్చకులు టీపీసీసీ చీఫ్కి ఆలయ అర్చకులు, దేవాలయాధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అధికారులు మహేష్ కుమార్ గౌడ్ ను సత్కారించారు.

