. . . 16 మందికి భారీ జరిమానా
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
మద్యం తాగి వాహనాలు నడిపినటువంటి 19 మందిని అరెస్ట్ చేసినట్టు ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ పి.ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశానుసారం బుధవారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ హైమద్ మొయిద్దిన్ ముందు హాజరుపరచగా 16 మందికి ఒకరికి రూ.10 వేల చొప్పున 1,60,000/-జరిమనా, నాగులవారి పండరి, కోటగిరి నరసింహ, తీలా విజయ్ కుమార్ అనే ముగ్గురికి వారం రోజుల జైలు శిక్ష విధించినట్టు ఆయన పేర్కొన్నారు.
