27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కరెంట్ షాక్ తో ఓకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి

Must read

📰 Generate e-Paper Clip

 

  బోదన్, బతుకమ్మ:

కరెంట్ షాక్ ఓక రైతు కుటుంబాన్ని బలితీసుకుంది. ఈ సంఘటన గురువారం ఉదయం నిజామాబాద్ జిల్లా పెగడపల్లి గ్రామ శివారులో పంట పొలాల్లో జరిగింది. రెంజల్ మండలం సాటా పూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఓర్సు గంగారం (45), ఓర్సు బాలమణి(40)  వారి కొడుకు ఓర్సు కిషన్ (22) లు గురువారం ఉదయం పంట పొలంలో వరికి నీరు పెట్టేందుకు వెళ్లారు. బోరు మోటార్ వద్ద కరెంట్ షాక్ తగలడంతో ముగ్గురు ఓక్కరిని ఒక్కరు కాపాడే క్రమంలో విధ్యుత్ షాక్ కు గురయ్యారు.

Three members of OK family died due to electric shock

 

విధ్యుత్ షాక్ తగిలి అక్క డికక్కడే మృతి చెందారు. ఘటన స్థలాన్ని బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబు, ఎస్ఐ మచ్చేందర్ చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సాటాపూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కిషన్ కు ఇంకా వివాహం కాలేదని తెలిసింది.

Three members of OK family died due to electric shock

 

More articles

Latest article