27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మహమ్మదీయ కాలనీలో చోరీ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ :  నగరంలోని ఐదో టౌన్ పరిధిలో చోరీ జరిగింది. ఈఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. నగరంలోని మహమ్మదీయ కాలానికి చెందిన కుటుంబం శనివారం రాత్రి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు.  గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి పడక గదిలోని బీరువాను ధ్వంసం చేసి రెండు తులాల బంగారం,  ఐదు తులాల వెండితోపాటు నగదును చోరీ చేశారు.  ఇంటికి తాళం వేసి వెళ్లిన యజమానులు ఆదివారం ఉదయం తిరిగిరాగా చోరీ విషయం తెలిసింది. బాధితులు ఐదో టాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఘటన స్థలాన్ని ఎస్సై గంగాధర్ పరిశీలించారు.

Theft in Mohammedan Colony

More articles

Latest article