మెదక్, బతుకమ్మ : మెదక్ పట్టణం గురువారం కురిసిన వర్షానికి జలమయమైంది. పట్టణంలోని ప్రధాన కూడలి రాందాస్ చౌరస్తా చెరువును తలపించింది. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. చమన్ రోడ్డు, జేఎన్ రోడ్డు వైపు నుంచి చౌరస్తాలోకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. రెండున్నర గంటల్లోనే 13 సె.మీ. వర్షం కురిసింది. ఇది రాష్ట్రంలో అత్యథికంగా నమోదైంది. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి తదితర జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

