- పోలీస్ వర్సెస్ ఏసీబీ అధికారులు పరుగో పరుగు..
మెదక్, బతుకమ్మ : లంచం తీసుకున్న ఎస్ఐని వెంబడించి ఏసీబీ అదికారులు పట్టుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్ఐ రాజేష్ ను ఏసీబీ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మంగళవారం ఓ వ్యక్తి నుంచి రూ.30వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో ఎస్ఐ రాజేష్ పారిపోతుండగా వెంబడించిన అధికారులు అతని పట్టుకున్నారు. ఎస్ఐ ఏసీబీకి చిక్కడంతో ప్రజలు టపాకాయలు కాల్చి ఆనందోత్సాహాలతో సంబరాలు జరిపారు.
