. . .పట్టుకున్న టిప్పర్లను తహసిల్దార్ కార్యాలయానికి తరలింపు
ఇందల్వాయి, బతుకమ్మ :
ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో అక్రమంగా మొరంను తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలిసులు పట్టుకున్నారు. సిఐ ఆదేశాల మేరకు గురువారం తెల్లవారుజమున ఎల్లారెడ్డి పల్లి గ్రామ శివారులో అక్రమంగా మొరం తవ్వి టిప్పర్లతో తరలిస్తున్నా సమాచారం మేరకు రెండు మోరం టిప్పర్లును పట్టుకొని ఇందల్వాయి ఎమ్మార్వో కార్యాలయానికి తరలించారు.అక్రమ మోరంను తరలించే వారి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని
ఇందల్వాయి ఎస్ హెచ్ ఓ మనోజ్ తెలిపారు.