. సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ పై మండిపాటు
నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన రాష్ర్ట వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రతిరాజ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి భవనం ముందు భాగంలో డ్యామేజీలను గమనించిన మంత్రి మరమ్మతులు ఎందుకు చేయించడం లేదని ప్రశ్నిస్తూ అసహనం వ్యక్తం చేశారు. మరమ్మతులు చేయిస్తామని సూపరింటెండెంట్ సమాధానమిస్తుండగానే మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముందుకు వెళ్లిపోయారు. లోనికి వెళ్తుండగా అక్కడే నిల్చున్న పేషెంట్లతో మాట్లాడారు. ఆస్పత్రిలో పరిస్థితి అధ్వానంగా ఉందని, సరైన వైద్యం అందడం లేదని వారు సమాధానం ఇవ్వడంతో సూపరింటెండెంట్ తోపాటు ఆయా విభాగా అధిపతుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఇస్తుంటే పరిస్థితి ఇలా ఉంటుందా? అని ప్రశ్నించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు మించి మెరుగైన వైద్యం అందించాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు.

