వెబ్ న్యూస్, బతుకమ్మ : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై, ఏడుపాయలలో దుర్గమ్మ మహాలక్ష్మీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ లోని భద్రకాళి అమ్మవారు లలితా మహా త్రిపుర సుందరి రూపంలో దర్శనమిచ్చారు. ఏపీలోని అమలాపురం కన్యకాపరమేశ్వరి ఆలయంలో మహాలక్ష్మీ దేవి రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా అమ్మవారితో ఆలయాన్ని రూ.4,41,99,999 విలువైన కరెన్సీ నోట్లతో తీర్చిదిద్దారు. పెద్దఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.



