నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఓ గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. తనతో పదో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకున్న అబ్బాయి తల్లిదండ్రులే తన చావుకు కారణమని సూసైట్ నోట్ లో వెల్లడించింది. అబ్బాయి తల్లిదండ్రుల వేధింపులు తాళలేక చదువు మధ్యలోనే ఆపేశానని, అయినా అసభ్య పదజాలంతో తనను దుర్భాషలాడరని, దీంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైట్ నోట్ లో పేర్కొంది. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
