- దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు
రుద్రూర్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలనీ నిరసిస్తూ బోధన్ పట్టణంలో బుధవారం నిర్వహించిన దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో సీఐటీయు ఆధ్వర్యంలో రుద్రూర్ మండలం నుండి గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, బీడి కార్మికులు అధిక సంఖ్యలో తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా ఏరియా సహాయ కార్యదర్శి నన్నేసాబ్, వివిధ ప్రజా సంఘాల నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
