మోర్తాడ్, బతుకమ్మ:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలను అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని మోర్తాడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు అన్నారు. మోర్తాడ్ మండలంలోని డోన్ పాల్ గ్రామంలో నూతన రేషన్ కార్డుల్లో పేర్లు వచ్చిన 80 మంది లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని బుధవారం పంపిణీ చేసే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.