డిల్లీ , బతుకమ్మ : తెలంగాణలో ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వలేమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. లోకసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో స్కిల్ యూనివర్సిటీ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు. ఇందుకు కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సమాధానమిస్తూ.. స్కిల్ యూనివర్సిటీకి తాము నిధులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. రాష్ట్రాలు తమ చట్టాల ప్రకారం స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తాయన్నారు.
స్కిల్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వలేం క్లారిటీ ఇచ్చిన కేంద్రం
