ఎల్లారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని అడవి లింగాల గ్రామంలో ఉద్రిక్త చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థులకు సమాన ఓట్లు రావడం తో అధికారులు టాస్ వేసి కాంగ్రెస్ అభ్యర్థి సంతోష్ విజేతను ప్రకటించారు. రీ కౌంటింగ్ చేయాలంటూ కౌంటింగ్ కేంద్రం వద్ద టాస్ లో ఓడిపోయిన అభ్యర్థి అనుచరుల ఆందోళన చేపట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు వర్గాలు గెలిచిన వర్గం, ఓడిన వర్గం సై అంటూ సై అన్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులకు తలనొప్పిగా మారింది. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ ఆదేశాలతో ప్రత్యేక బలగాలను రంగంలోకి దించి గొడవ జరుగకుండా సద్దుమనిగిపించారు.