ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను దుమాల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ సభ్యులు ఆదివారం కలిశారు .దుమాల గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం శిథిలావస్థకు చేరుకోగా గ్రామస్థులు ఆలయ కమిటీ సభ్యులు పునః నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా ప్రహరి గోడ నిర్మాణానికి, బోరు మోటారు గురించి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు రేపాక రామచంద్ర రెడ్డి, జిల్లా కార్యదర్శి మద్దుల బుగ్గారెడ్డి, బిజెవైయం జిల్లా ప్రధాన కార్యదర్శి మానుక కుమార్ యాదవ్, దేవాలయ కమిటీ చైర్మన్ ఉల్లి బాలయ్య,టెంపుల్ పాలకవర్గం కొలనురు శంకర్, గుల్లపల్లి సత్యనారాయణ రెడ్డి, ధర్మారపు రవి, అంకం వెంకటేష్, కదిరే శ్రీనివాస్, నిమ్మల బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
