నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో దోస్త్ ఆన్లైన్ డిగ్రీ ప్రవేశానికి 2025 -26 సంవత్సరానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రత్యేక కేటగిరి పి హెచ్ సి ( దివ్యాంగులు )/ సి ఏ పి / ఎన్ సి సి /స్పోర్ట్స్/ఎక్సట్రా కర్క్యూలర్ ఆక్టివిటీస్) విద్యార్థిని, విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఈ రోజు అడ్మిషన్స్ కార్యాలయంలో జరిగింది. ప్రత్యేక కేటగిరి ఎన్ సి సి లో నలుగురు స్పోర్ట్స్ లో ఇద్దరు, పి హెచ్ సి ( దివ్యాంగులు ) లో ఒకరు మొత్తం ఏడుగురు విద్యార్థి ని విద్యార్థినులు హాజరైనారని దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ వాసం చంద్రశేఖర్ తెలిపారు. ఈ పరిశీలనలో ఎన్ ఎస్ ఎస్ ఆఫీసర్ డాక్టర్ రామస్వామి, తెలంగాణ వర్సిటీ ఫిసికల్ డైరెక్టర్ డా.నేత టెక్నికల్ అసిస్టెంట్ నరేష్, రవీందర్ నాయక్ పాల్గొన్నారు.
తెలంగాణ వర్సిటీ డిగ్రీ దోస్త్ ఆన్లైన్ ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన
