బతుకమ్మ: బిచ్కుంద : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సోమ వారం బిచ్కుందమండలంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో గోపాలకృష్ణ, తహశీల్దార్ కార్యాలయం నందు, తహశీల్దార్ వేణుగోపాల్, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ మోహన్ రెడ్డి, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నందు మార్కెట్ కమిటీ చైర్మన్ కవితా ప్రభాకర్ రెడ్డి, తో పాటుగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో జెండా ఎగురవేసి తెలంగాణ విశిష్టతను వివరించారు. బిచ్కుంద మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవీందర్, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది పోలీస్ సిబ్బంది, ఇతర ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు పాల్గొన్నారు.

