హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలో పీఈసెట్, ఎడ్ సెట్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మార్చి 12న పీఈసెట్ నోటిఫికేషన్ ను జారీ చేయనున్నారు. మార్చి 15 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. జూన్ 11 నుంచి 14 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఎడ్ సెట్ నోటిఫికేషన్ మార్చి 10న విడుదల కానుంది. మార్చి 12 నుంచి మే 13 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కాకతీయ యూన్సివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. జూన్ 1 ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.
