హైదరాబాద్, బతుకమ్మ : సాంకేతికలోపంతో మూడు సార్లు రన్ వే పైకి వెళ్లి విమానం తిరిగి వచ్చింది. ఈఘటన శంషాబాద్ ఎయిర్ పోర్టులో చోటు చేసుకుంది. శంషాబాద్ నుంచి అలయన్స్ ఎయిర్ లైన్స్ విమానం రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లాలి. పైలట్ సాంకేతిక లోపం గుర్తించి అప్రమత్తమయ్యాడు. ఈఘటన సమయంలో విమానంలో 37 మంది తిరుపతికి వెళ్లాల్సిన ప్రయాణికులు ఉన్నారు. విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికుల ఆందోళనకు దిగారు.
సాంకేతిక లోపం.. మూడుసార్లు రన్ వే పైకి వెళ్లి తిరిగి వచ్చిన విమానం
