29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

రైల్వే స్టేషన్ లో సిబ్బందికి టీబీ స్క్రీనింగ్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా వైద్యా, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ లోని హౌస్ కీపింగ్ సిబ్బందికి టీ. బీ స్క్రీనింగ్ ను శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్. దీప మాట్లాడుతూ ప్రయాణికులు, సిబ్బంది టీ. బీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతే కాకుండా టీ. బీ పట్ల అందరు అవగాహన పెంచుకోవాలన్నారు. అనంతరం టీ. బీ లక్షణాలు ఉన్న సిబ్బందికి, ప్రయాణికులకు తేమడ నమూనా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్. ఐ. వీ కోర్డినేటర్ రవిగౌడ్, రైల్వే హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రేమ్, పీపీటీసీ కౌన్సిలర్ రాధ, ల్యాబ్ టెక్నిషియన్ రవి, ఐ సీ టీ సీ కౌన్సిలర్ రవి, రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article