24.8 C
Hyderabad
Friday, July 31, 2026

చైనా మాంజా షాపులపై టాస్క్ ఫోర్స్ దాడులు

Must read

📰 Generate e-Paper Clip

రూ.10వేల విలువ గల చైనా మాంజా స్వాధీనం

 నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ ఇంచార్జీ పోలీస్ కమీషనర్ సింధు శర్మ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్చార్జ్ ఏసిపి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిబ్బంది పతంగుల దుకాణాలపై శుక్రవారం దాడి చేశారు. నగరంలోని రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య, సిసిఎస్ సిబ్బంది పతంగుల షాపులపై దాడి చేసి 10 చైనా మాంజా బాబిన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 10 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు.  పతంగుల షాపు యజమానిని తదుపరి చర్య నిమిత్తం టౌన్ 2 ఎస్ హెచ్ ఓ కు అప్పగించామని తెలిపారు.

More articles

Latest article