బతుకమ్మ, కోటగిరి :
అనుమానస్పదంగా వివాహిత మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హంగార్గ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం హంగార్గ గ్రామనికి చెందిన మణిగిరి లక్ష్మి (38) తన భర్త మల్లికార్జున్ ఇద్దరు కొడుకులతో కలిసి డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనిలో కొన్నేళ్లుగా నివసిస్తున్నారు. గురువారం రోజు రాత్రికి లక్ష్మి తన ఇంట్లో అనుమానస్పదంగా మృతి చెందింది. ఆత్మహత్యకు పాల్పడిందా లేదా ఇంకా ఏమైనా జరిగిందా అనే విషయాలు తెలియాల్సింది ఉంది.
