- . భిక్కనూరు రామేశ్వర్ పల్లి గ్రామాల్లో పోలీసుల బందోబస్తు..
బతుకమ్మ భిక్కనూరు: సంగారెడ్డి జిల్లాలో హత్యకు గురైన నారాయణ పిల్లలకు న్యాయం జరిగేంతవరకు అంత్యక్రియలు నిర్వహించేది లేదని గ్రామస్తులు బంధువులు భీష్మించుకు కూర్చుండడంతో ఆయన అంతక్రియలు ఆలస్యంగా నిర్వహించారు. వివరాల్లోకి వెళితే నారాయణ మృతదేహాన్ని సంగారెడ్డిలో పోస్టుమార్టం నిమిత్తం గ్రామానికి తీసుకువచ్చే సమయంలో నారాయణ మృతదేహాన్ని ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాకేష్ ఇంటి వద్ద వేస్తామని గ్రామస్తులు, బంధువులు అనడంతో మల్లుపల్లి గ్రామంతోపాటుగా రామేశ్వర్ పల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం నుండి పోలీసులు భారీ బందోబస్తును నిర్వహించారు. దీంతో ఇరు గ్రామాల పెద్దలు సమావేశమై నిందితుడు రాకేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి నారాయణ పిల్లలకు అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చిన అనంతరం నారాయణ అంతక్రియలను మల్లు పల్లిలో నిర్వహించారు. అంత్యక్రియలు సజావుగా జరగడంతో పోలీసులు ఇరు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
