బాన్సువాడ, బతుకమ్మ:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల పంచాయతీ అధికారి నాగరాజు ను సస్పెండ్ చేస్తు జిల్లా కలెక్టర్ అశీష్ సంగ్వాన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనుల పర్యవేక్షణ నిర్లక్ష్యంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్న విషయం తెలిసిందే. బాన్సువాడ మండలం లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై జరిగిన సమీక్షలో పురోగతి, విధుల నిర్లక్ష్యం కారణంగా ఎంపిఓ పై వేటు వేశారు. నాగరాజును హైదరబాద్ లోని పంచాయతీ రాజ్ కమిషనర్ కు సరెండర్ చేసినట్లు తెలిసింది.