బతుకమ్మ, జుక్కల్ : జుక్కల్ మండలంలోని మథుర తాండలో శుక్రవారం ఎంపీడీఓ శ్రీనివాస్ ఇందిరమ్మ ఇళ్ల సర్వేను తనిఖీ చేశారు. సర్వే వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. ఎలాంటి తప్పులకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మాజీ సర్పంచ్ సంజు, తదితరులు పాల్గొన్నారు.
