బోధన్, బతుకమ్మ : బోధన్ మండలం కండ్గావ్ గ్రామ శివారులోని మంజీర వంతెనపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణ-మహారాష్ట్ర రాష్ట్రాలను కలుపుతున్న ఈ వంతెన నీటమునిగిపోవడంతో వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిజాంసాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో మంజీర నదిలో భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. అప్రమత్తంగా ఉండాలని, వంతెన వద్దకు ఎవరు వెళ్లరాదని అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
