బతుకమ్మ, భిక్కనూరు : విద్యార్థులు జంక్ ఫుడ్ లకు దూరంగా ఉండాలని భిక్కనూరు సిద్ధార్థ పాఠశాల కరస్పాండెంట్ సుధాకర్ ప్రిన్సిపాల్ శ్రీకాంత్ అన్నారు. శనివారం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించారు. ఫుడ్ ఫెస్టివల్ ను పురస్కరించుకొని విద్యార్థులు పలు రకాల వంటకాలను తయారుచేసి ప్రదర్శించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ విద్యార్థులకు జంక్ ఫుడ్ వలన కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

