26.3 C
Hyderabad

ఎస్సారెస్పీ గేట్లు మూసివేత

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా , బతుకమ్మ :  ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్ ఫ్లో క్రమంగా తగ్గడంతో గురువారం ఉదయం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లను మూసివేసినట్లు ప్రాజెక్ట్ డీఈ ఈ గణేశ్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 1,20,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా గురువారం ఉదయం ప్రాజెక్టులో 1089.20 అడుగులు, 74.129 టిఎంసీల నీరు ఉంది. వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కులు, కాకతీయ 5000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3000 క్యూసెక్కులు, లక్ష్మి 150 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది.

More articles

Latest article