25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎస్సారెస్పీ గేట్లు మూసివేత

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ:ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ఇన్ఫ్లో క్రమంగా తగ్గడంతో  శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్లను గురువారం మూసివేసినట్లు ప్రాజెక్ట్ డిఈ ఈ గణేష్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 9654క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 1091.00 అడుగులు, 80.501 టిఎంసిల నీరు ఉంది.  కాకతీయ 5000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 3000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మి 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు నీటి విడుదల కొనసాగుతుందని తెలియజేశారు.

More articles

Latest article