మెండోరా, బతుకమ్మ : ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీ లోకి వస్తున్న వరద ప్రవాహం తగ్గడంతో శుక్రవారం ఎస్సారెస్పీ గేట్లను మూసివేసినట్లు ప్రాజెక్టు ఏఈ రవి తెలిపారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 50826 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. వరద కాలువ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువ ద్వారా 4500 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 నీటి విడుదల కొనసాగుతుంది. తిను ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.5 టీఎంసీలు కాగా శుక్రవారం ప్రాజెక్టులో 1090 అడుగులు, 76.894 టీఎంసీలు నీరు ఉంది.
