- పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : సర్వర్ అంతరాయం వల్ల ఆన్లైన్లో విద్యార్థుల వివరాలు పొందుపరచడంలో ఇబ్బందులు దృష్ట్యా ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎస్ఎస్సి బోర్డు పరీక్ష ఫీజు తేదీని పొడిగించాలని పిఆర్టియు తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి కోరారు. శుక్రవారంతో పరీక్ష ఫీజు ముగిస్తున్నందున ఆన్లైన్లో విద్యార్థుల వివరాలు పొందుపరచడంలో ఇబ్బందులు అవుతున్న దృష్ట్యా పరీక్ష ఫీజు గడువు పెంచాలని కోరారు.
