బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని టోల్ ప్లాజా వద్ద నేషనల్ హైవేపై బుధవారం పోలీసులు వాహనాల తనిఖీ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. టోల్ ప్లాజా వద్ద సరైన ధ్రువీకరణ పత్రాలు లేని, ఓవర్ లోడ్ వాహనాలకు, హెల్మెట్ లేని ద్వి చక్రవాహనదారులకు జరిమాణాలు విధించారు. వాహనాలపై పెండింగ్లో ఉన్న చలాన్లను పెద్ద ఎత్తున స్వీకరించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు.
