27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

మా సమస్యలు పరిష్కరించండి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నీటి సమస్యతో ఇబ్బందులకు గురవుతున్న లబ్ధిదారులు

 

ఇందల్వాయి, బతుకమ్మ :

 

ఇందల్వాయి గ్రామంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ఇప్పటివరకు ఇంటి పట్టాలు ఇవ్వలేదని కాలనీవాసులు, కాలనీ పెద్దలు జగ్గ గంగాదాసు, రాంబాబులు ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నీటి సమస్య, కరెంటు సమస్య అధికంగా ఉందని, ఎమ్మెల్యే స్పందించి సమస్యలను తీర్చెందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమ్మరి గంగాధర్, సూకూరు రాజయ్య, తలారి బిక్షపతి, ఎడపల్లి సాయిలు, ముకుందం, మెచ్చే సాయిలు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article