భద్రాద్రి కొత్తగూడెం, బతుకమ్మ : కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట 6 గురు మావోయిస్ట్ దళ సభ్యులు లొంగిపోయారు. జనవరి 2025 నుండి జిల్లా పోలీస్ ఆపరేషన్ చేయుత ద్వారా వివిధ హోదాల్లోనీ 300 మంది మావోయిస్ట్ ల లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్ట్ లకు ఒకొక్కరికి 25 వేల తక్షణ సహాయం అందజేశారు. మావోయిస్ట్ లకు సహకరించి ఆదివాసీల అభివృద్ధికి ఆటకం కలిగించవద్దని ఎస్పీ రోహిత్ రాజ్ సూచించారు.
