నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నగరంలోని కసబ్ గల్లీ లోని హైమది మార్కెట్ లో గల మేకల మండి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వారికి వేరే స్థలం ఇవ్వాలని కసబ్ గల్లీ వాసులు కోరారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆదేశానుసారం శనివారం నుడా ఛైర్మెన్ కేశ వేణు, ఆర్డీఓ స్రవంతి, మున్సిపల్ ఆఫీసర్స్, స్థానిక ఎమ్మార్వో బాలరాజ్ లతో స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కుల పెద్దలతో ఈ స్థలం గురించి చర్చించారు.
