హైదరాబాద్, బతుకమ్మ : ఎస్సీలను 1,2,3 గ్రూపులుగా కాకుండా ఏ,బీ, సీ,డీ వర్గీకరించాలని మంద కృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం సీఎం రేవంత్ తో ఆయన భేటీ అయ్యారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలో కొన్నిలోటుపాట్లు ఉన్నాయని ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. ఈలోటుపాట్లు సరిచేస్తారని ఆశిస్తున్నామన్నారు.
ఎస్సీలను ఏ,బీ,సీ,డీలు గా వర్గీకరించాలి: మంద కృష్ణ
