మెండోరా, బతుకమ్మ: మెండోరా మండలం దూదిగాం గ్రామంలో శుక్రవారం చెరుకు, వరి పరిశోధన స్థానం రుద్రూర్ శాస్త్రవేత్తల బృందం పర్యటించడం జరిగింది. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా రైతు రాజేంధర్ పొలంలో సాగుచేస్తున్న ఆర్డీఆర్ 1200 రకం వరి క్షేత్రాన్ని వీక్షించి రైతులకు పలు సూచనలు చేసారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు రాకేష్, కృష్ణ చైతన్య, మండల వ్యవసాయ అధికారి వసంత్, విస్తరాణాధికారి సాయి కృష్ణ, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.