కామారెడ్డి, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా లో శనివారం ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలలో కామారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా కుంటోల్ల యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా సతీష్, ఉపాధ్యక్షులుగా రోడ్డ సాయిరాం, బస్వంత్, శ్రీను నాయక్, కోశాధికారిగా భూంపల్లి రాజేష్, సహాయ కార్యదర్శిగా కీసరి రాజు, హనుమాన్లు, పెరమండ్ల రాజు, సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాస్ ప్రచార కార్యదర్శిగా బాలాజీ కాంబ్లె సలహాదారులుగా భిక్కనూర్ సాయిలు ఆశన్న, బాబురావు లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి మేయర్ ఉమారాణి, ఎస్సీ, ఎస్టీ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
