27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా ఓబీసీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వినాయక నగర్ హనుమాన్ జంక్షన్ వద్ద గల విగ్రహాల పార్కులోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి ఓ బి సి అధ్యక్షుడు రాజ నరేందర్ గౌడ్, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా ఈ సందర్భంగా ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బహుజన ధీరత్వానికి ప్రత్యేక అని అన్నారు. సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తితో బహుజనులు అందరి ముందుకు సాగి తమ హక్కులను సాధించుకోవాలన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే బీసీ కులాలు అన్ని ఏకమై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్లు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article