27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే అంతే సంగతులు

Must read

📰 Generate e-Paper Clip

  • ట్రాఫిక్ ఏ సీ పి నారాయణ

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ఆగస్టు 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని ట్రాఫిక్ ఏసిపి నారాయణప్రజలకు సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేపటినుండి నిజామాబాద్ నగరం తో పాటు జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించి తమ ప్రయాణాలు కొనసాగించాలని ఆయన అన్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదంలో ప్రజలు, వాహనదారులు తమ విలువైన ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందని ఆయన అన్నారు. తమ పోలీస్ శాఖలు పనిచేస్తున్న ఉద్యోగులు కూడా హెల్మెట్ ధరించి విధులకు హాజరుకావాలని పట్టుబడితే పోలీస్ శాఖ ఉద్యోగులను కూడా జరిమానా విధించడంతోపాటు వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఇతర సాధారణ ప్రజలు కూడా తమ తనిఖీలను పట్టుబడితే జరిమానా విధించి వాహనాన్ని సీజ్ చేసి ఆర్టీవో కార్యాలయానికి పంపించడం జరుగుతుందన్నారు.

More articles

Latest article