హైదరాబాద్, బతుకమ్మ : నగరంలోని షామీర్ పేట్ వద్ద వాహనాల తనిఖీలో ఓ కారులో భారీగా నగదు లభ్యమైంది. కారు టైర్లు, సీట్ కింద రూ. నాలుగు కోట్ల నగదును పోలీసులు గుర్తించారు. హవాలా మార్గంలో డబ్బులు తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో బోయిన్ పల్లి క్రైమ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ ముఠాను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.