వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన బుట్ట మల్లయ్యకు ఈఆర్సీపీ వైద్యానికి అయ్యే ఖర్చు రూ. 2లక్షల ఎల్ వోసీని ఆదివారం కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. బాధితుడు బుట్ట మల్లయ్య అనారోగ్యం తో బాధ పడుతు హాస్పిటల్ కు వెళ్లగా అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి ఈ ఆర్ సీ పీ సెట్టింగ్ చేయాలని సూచించారు. ఈ విషయాన్ని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ చార్జి ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి బాధిత కుటుం బ సభ్యులు తీసుకెళ్లారు. స్పందించిన ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 2 లక్షల ఎల్ వో సీని ఇప్పించారు. దీంతో సునీల్ కుమార్ కు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదములు తెలిపారు.
