
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: మోపాల్ మండలం న్యాల్ కల్ బ్రిడ్జి వద్ద సోమవారం ఉదయం కల్లు పెట్టెల లోడ్ తో వెళ్తున్న టాటా ఏస్, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అతీక్ తలకు తీవ్రగాయమైంది. ఆటో లో ఉన్న సిర్పూర్ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలకు సైతం గాయాలయ్యాయి. కల్లు లోడ్ తో వెళ్తున్న టాటా ఏస్ డ్రైవర్ కు లైసెన్స్ లేన్నట్లు తెలిసింది. ఆటో డ్రైవర్ అతీక్ పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం జీజీహెచ్ కు తరలించి, ఆటోలను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

