ఇందల్వాయి, బతుకమ్మ : మండల కేంద్రంలోని ఇందల్వాయి తండాలో అకాల వర్షం కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చిన వరి ధాన్యంతో పూర్తిగా తడిసి ముద్దైంది. రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకోవలసి వస్తుందని అన్నారు. వర్షంతో తడిసిన ధాన్యాన్ని మ్యాచర్ కు సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. అకాల వర్షాలతో తమను జీవితాలు అంధకారంలోకి వెళ్లడం బాధాకరమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
