బాన్సువాడ, బతుకమ్మ : ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజే ఉన్నఎస్బిఐ క్లర్క్ పరీక్షను వాయిదా వేయాలని ఈ విషయాన్ని పై అధికారులు, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సబ్ కలెక్టర్ కిరణ్మయికి బీసీ సంఘం ద్వారా మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఒకే రోజు ఎమ్మెల్సీ పోలింగ్ ఉండడం, అదే రోజు ఎస్బిఐ క్లర్కు పరీక్ష ఉండడం వల్ల ఓటు హక్కును కోల్పోయే పరిస్థితి నెలకొందని, దీనివల్ల ఎస్బిఐ పరీక్షకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఎస్బిఐ క్లారిటీ పోస్టు పరీక్ష వాయిదా వేయలని బీసీ సంఘం నాయకులు సబ్ కలెక్టర్ కిరణ్మయిని కోరారు. ఈ కార్యక్రమంలో పెంట సాయి,కొమ్ము సాయికుమార్, జనేశ్వర్, ముదిరాజ్.పుట్ట వినయ్ కుమార్,బాలు.. తదితరులు పాల్గొన్నారు.
