నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్చిడ్ స్కూల్ లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం నగరంలోని సూర్యనగర్ లోని ఆర్కిడ్ స్కూల్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషాదారణలతో ఆకట్టుకున్నారు. పాఠశాల నిర్వాహకులు విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.

