హైద్రాబాద్ , బతుకమ్మ:
స్టేట్ లో జరుగుతున్న కుల గణన కమీషన్ కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన నివేదిక అందించనున్నారు. ఈ మేరకు సోమవారం కాసెపట్లో బీసీ సంఘాలు,యునైటెడ్ ఫులే ఫ్రంట్ , తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి కులగణన కమిషన్ కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివేదిక అందజేయనున్నారు. 35 పేజీలతో తెలంగాణ జాగృతి నివేదిక నివేదిక తయారు చేసినట్లు తెలిసింది. సమగ్ర అధ్యయనం తరువాత 20 డిమాండ్లను కమిషన్ ముందు ఉంచేందుకు జాగృతి అధ్వర్యంలో నివేదిక రూపోందించినట్లు సమాచారం.