బీహర్ లో జరిగే కార్యక్రమంలో విడుదల చేయనున్న మోదీ
రైతుల ఖాతాల్లో జమకానున్న రూ.22వేల కోట్లు
వెబ్ న్యూస్,బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ నిధులు సోమవారం విడుదల కానున్నాయి. బీహార్ లోని భాగల్పూర్ లో జరగనున్న కార్యక్రమంలో 19వ విడుత ఈనిధులను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు. రైతుల ఖాతాల్లో రూ.22 వేలకోట్లు జమకానున్నాయి. ఈపథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటివరకు 18విడతల్లో రూ.3.46 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో కేంద్రం జమ చేసింది.
